ATP: గుత్తి మండలం లచ్చన్న పల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకులు నాగరాజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నాగరాజు భౌతికాయానికి గుత్తి మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.