NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలోని శ్రీ శక్తి భవనంలో మంగళ, బుధవారాల్లో సచివాలయ సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 9 అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య మెరుగుపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.