KRNL: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గుంతల రహిత రహదారుల పనులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి బీసీ అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యం జరగకుండా చూస్తామన్నారు.