VZM: దేవస్థాన భూముల్ని అన్ని విధాలా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. శుక్రవారం జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 11 వేల ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదని, ఇందులో కొంత ఆక్రమిత భూమి ఉందని, ఈ భూమి వెంటనే సర్వే చేయించాలని రెవిన్యూ అధికారులకు తెలిపారు.