ప్రకాశం: సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట రైతుసేవా కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారిణి పావని రైతు విశిష్ట గుర్తింపు కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నిర్ణయించింది. కావున రైతులందరూ రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.