VSP: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వియత్నాంతో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సోమవారం విశాఖలో ఏపీ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వియత్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఛైర్మన్ చౌ ట్రీ యంగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, బౌద్ధ మతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, బొజ్జన్నకొండ సందర్శించేందుకు వియత్నాం ఆసక్తి చూపిస్తున్నారు.