ASR: చింతపల్లి మండలం ఎర్రవరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఆదివారం వీకెండ్ కావడంతో తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. జల జల జారువారుతున్న జలపాతంలో స్నానాలు ఆచరించి సందడి చేస్తున్నారు. అయితే జలపాతం వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.