KKD: సీఎం చంద్రబాబు తనకున్న మీడియాను చూసి రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి, YCP కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్నబాబు ఆరోపించారు. సోమవారం రూరల్ వైద్య నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు భజన చేసే ఓ మీడియా సంస్థకు విశాఖలో భూమి, మరో సంస్థకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రజలు బాబు ప్రచారం ఎంతో కాలం నమ్మరని.. తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.