SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాల భద్రలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.