ATP: మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో మెప్మా ఆధ్వర్యంలో 378 మహిళా సంఘాలకు రూ.62 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.