PLD: బలుసుపాడు గ్రామంలో టీడీపీకి ఓటు వేశాడని మంటి బాబుపై అర్ధరాత్రి సింగం నాగమల్లేశ్వరరావు, మరికొందరు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. ఇంట్లోకి చొరబడి అన్నం తింటున్న తనని బయటికి లాక్కొచ్చి దాడి చేసి, కుటుంబ సభ్యులను గాయపరిచారన్నారు. బాధితుడి కేకలతో స్థానికులు రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.