KRNL: ఆదోని మండలంలోని దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకున్న మొండి ఏసయ్య గుడిసెను బాలస్వామి, తిక్కన్న, తదితరులు ధ్వంసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం ఈ ఘటనపై పెద్దతుంబళం పోలీస్ స్టేషన్లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.