SKLM: జిల్లా మీదుగా నడిచే అమృత్ భారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా బ్రహ్మపూర్-సూరత్(ఉద్నా)-బ్రహ్మపూర్( నం. 19021/22) అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు బ్రహ్మపూర్ నుంచి ప్రతి సోమవారం, సూరత్ నుంచి ప్రతి ఆదివారం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ రైలు జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు, పలాసలోఆగుతుందని రైల్వే శాఖ తెలిపింది.