E.G: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద సోమవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో రోగులకు సంతృప్తికరమైన వైద్య సదుపాయాలను సేవలను అందించాలని వైద్యాధికారులను సూచించారు.