సత్యసాయి: మడకశిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 23న జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పదివేల ఇళ్ల పట్టాల పంపిణీ, 100 స్మశాన వాటికల అంకితం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.