VSP: వీఏంఆర్డీఏలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వీఏంఆర్డీఏ ఛైర్పర్సన్ ఎంవీ.ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఏంఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై ప్రజలు వినతులు అందజేయవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రణవ్ గోపాల్ నేరుగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపారు.