GNTR: ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యొక్క ప్రధాన ఉద్దేశమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జిల్లా ప్రజల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదులను స్వీకరించారు.