అన్నమయ్య: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లిలో బొప్పాయి పంటల తోటను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. రైతులతో ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు .రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.