చిత్తూరు: జిల్లాలో ఈ నెల చివరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పర్యటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.