ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27 నుంచి జరగనున్న ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సందేహాలకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్ఐఓకు ఆదేశాలు జారీ చేశారు.