PLD: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,46,096 చెక్కులను వారికి అందజేసారు.