కృష్ణా: కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ (బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం 07719 గుంటూరు-గయ రైలును జనవరి 25న, నం. 07720 గయ-గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం. 07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు.