ATP: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. రైతులతో కలిసి ర్యాలీ అనంతరం జేసీ అభిషేక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సమన్వయకర్తలు మక్బూల్, దీపిక తదితరులు పాల్గొన్నారు.