సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా హిందూపురంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అదనపు జిల్లా జడ్జి శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందమందికి పైగా యువత రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.