NTR: కూటమి హయాంలో తిరువూరు మండల పరిధిలోని కొత్తపల్లి-శ్రీనికేతన్ రోడ్డుకు మరమ్మతులు చేశామని శనివారం టీడీపీ తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఈ రోడ్డు గుంతులతో నిండిపోయి అధ్వాన్నంగా ఉండేదని టీడీపీ ఆరోపించింది. జగన్ పాలనలోని ఐదేళ్ల నరకయాతన నుంచి గోతులతో నిండిన రహదారులకు విముక్తి కల్పించామని ఈ మేరకు Xలో పేర్కొంది.