GNTR: హరియాణాలో జులై 3, 4 తేదీలలో జరిగే అర్బన్ లోకల్ బాడీలపై జాతీయ స్థాయి సదస్సులో గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ సజీల పాల్గొననున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మెరుగైన సేవల కోసం ఈ సదస్సు నిర్వహించనున్నారు.