ATP: తాడిపత్రిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ఏటిగడ్డపాలెం బ్రహ్మంగారి గుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే వ్యక్తిని హతమార్చారు. నిందితులు కత్తితో మెడపై పొడిచి, బండరాయితో తలపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు బంకమట్టి వీధికి చెందిన పెయింటర్ బాషా కుమారుడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.