కృష్ణ: హత్యాయత్నం కేసులో వల్లభనేని వంశీ అనుచరులకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నూతక్కి సునీల్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే వంశీని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనగాని రవి, తేలప్రోలు రాము, కొమ్మా కోట్లు సహా మరో ఆరుగురికి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.