PLD: ముప్పాళ్ల మండల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సోమేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ వినియోగం పెరిగిపోయిందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ATM పిన్ నంబర్, CVV నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే చెప్పకూడదని సూచించారు.