VSP: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసినట్లు వారు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో 42 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.7,22,000 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.