ASR: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం పెదబయలు మండలంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపుట్టులో 12.4, అనంతగిరి, డుంబ్రిగుడ, గూడెం కొత్తవీధి మండలాల్లో 12.9, పాడేరు 13.2, హుకుంపేట 13.5, చింతపల్లి 13.9, కొయ్యూరు మండలంలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.