ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతా కుంకుమార్చనలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి నైవేద్యాలు అందించారు. ధనుర్మాసం సందర్భంగా మహిళ భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.