KKD: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏలేశ్వరం మండల తహశీల్దార్ ఆఫీస్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ అధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏగుపాటి అర్జున్ రావు మాట్లాడుతూ.. ఏలేశ్వరంలో చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. వారు జీవించడమే చాలా కష్టతరంగా ఉందని, కూలికి వెళ్తే అవి రోజువారీ ఖర్చులు కూడా చాలడం లేదన్నారు.