TPT: తిరుపతి అభివృద్ధిలో భాగంగా వకుళమాత ఆలయం-చెర్లోపల్లి జంక్షన్ మధ్య 200 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మిస్తున్నారు. సంబంధిత పనులను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. భూములు కోల్పోయిన వారికి TDR బాండ్ల ద్వారా పరిహారం అందిస్తామని తెలిపారు. రోడ్డు నాణ్యత, సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు.