ATP: శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ మాజీ సీఎం వైయస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. కోటి సంతకాల కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామని ఆయనకు వివరించారు.