ELR: ఈనెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు స్థానిక సివిల్ జడ్జి కిషోర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చెక్కు బౌన్స్ కేసులు, నాటుసారా, ఎక్సైజ్, లిక్కర్ ఇతర కేసులు రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. రాజీయే రాజమార్గమన్నారు.