TPT: తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.9.41 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఈ సత్యనారాయణ తెలిపారు. కాగా, కాటేజీలు, విశ్రాంతి సముదాయాల మరమ్మతులు, మాడ వీధుల్లో భజన మండపాలు, పుష్కరిణి, క్యూలైన్లు, ఘాట్ రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధి చేశారు.