అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేకువ జామునే స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, పలు రకాల పుష్పాలు, తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.