KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో మండలంలోని పలు గ్రామాల నుంచి నియామకమైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను సన్మానించారు. రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఎన్నికైన అభ్యర్థులు రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలని అన్నారు.