GNTR: దేశంలో రూ.10కే ప్రమాదకరమైన పాన్ మసాలాలు విక్రయిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ‘నో డ్రగ్స్’ ప్రచార కార్యక్రమం మంచిదేనని, అయితే గుట్కా, పాన్ పరాగ్, ఖైని వంటి వాటిని నిషేధించాలన్నారు.