GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గృహాలు పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డైమండ్ బాబు బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కొంత ఆర్థిక సహాయం అందజేశారు.