ELR: గ్రామాలలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేశామని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలం గోపాలపురంలో విద్యుత్ ట్రాన్ ఫారంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని 10 గ్రామాలలో 11 కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు.