E.G: విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీలను రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు శనివారం తెలిపారు. ఇక్కడ ఖైదీల సంఖ్య పెరగడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీని సామర్థ్యం 914 కాగా, ప్రస్తుతం 2,080 మంది ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. 200 మంది ఖైదీలను రాజమండ్రి కారాగారానికి బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.