KDP: రైతు సమస్యల పట్ల కడపలో చేపట్టనున్న అన్నదాత పోరుబాట నిరసన కార్యక్రమానికి శుక్రవారం ఎర్రగుంట నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల మండల పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్నదాత పోరు బాట కార్యక్రమానికి వెళ్లారు.