PLD: సత్తనపల్లి పట్టణంలోని 13వ వార్డుకు చెందిన షేక్ రోషిని జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కన్నా రోషిని ఇంటికి వెళ్లి అభినందించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోషిని కష్టపడి చదివి నేడు సివిల్ జడ్జిగా నియమితులవడం ఆనందకరం అన్నారు. కన్నా వెంట పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.