సత్యసాయి: జిల్లాలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఫిబ్రవరి నెలాఖరు వరకు జిల్లాలో మొత్తం ఒక కోటి 26 లక్షల మంది మహిళలు ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.