కృష్ణా: పెనమలూరు(M) తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.