NTR: జిల్లాలో 80, 859 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,295 మంది ఫస్టియర్, 39,564 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. రేపు శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో జిల్లాలోని విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.