GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీలు జి.వి.రమణమూర్తి, హనుమంతు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్గదర్శకమని, ప్రతి పోలీస్ అధికారి రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పోలీసులంతా రాజ్యాంగ ప్రమాణ స్వీకారం చేశారు.