SS: నంబులపూలకుంట మండలంలోని గంగినాయుని పల్లికి చెందిన ఓ యువకుడు స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు మండల వైద్యాధికారి ఆనంద్వర్ధన్ తెలియజేశారు. యువకుడికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో బెంగళూరు సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేరారని అన్నారు. ఎలిశా పరీక్షలు చేయడంతో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.